దంబుల్లా: సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన భారత మహిళల జట్టు.. మరో మ్యాచ్ మిగిలుండగానే శ్రీలంకపై టీ20 సిరీస్ విజయం సాధించింది. శనివారం జరిగిన రెండో మ్యాచ్లో హర్మన్ప్రీత్ బృందం 5 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మొదట లంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. విష్మి (45), చమరి (43) రాణించారు.
భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం టీమ్ఇండియా 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (31 నాటౌట్), వైస్ కెప్టెన్ స్మృతి మందన (39; 8 ఫోర్లు) ఆకట్టుకున్నారు. హర్మన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమై న మూడో టీ20 సోమవారం జరుగనుంది.