మాలె: దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (సాఫ్) చాంపియన్షిప్లో భారత్ తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం చావో రేవో పోరులో భారత్ 1-0తో నేపాల్పై గెలుపొందింది. కీలక పోరులో కెప్టెన్ సునీల్ ఛెత్రీ (82 వ నిమిషంలో) ఏకైక గోల్ చేసి జట్టును గెలిపించాడు. పేలవ ఆటతీరుతో గత రెండు మ్యాచ్లను ‘డ్రా’గా ముగించిన భారత్.. ఈ సారి సమిష్టిగా సత్తాచాటింది. ఈ విజయంతో మూడు పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఛెత్రీ సేన ఓవరాల్గా ఐదు పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.