భోపాల్: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత యువ షూటర్ రుద్రాంక్ష్ పాటిల్ రెండో పతకం కైవసం చేసుకున్నాడు. భోపాల్ వేదికగా జరుగుతున్న పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో రుద్రాంక్ష్ 262.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నాడు. చైనా షూటర్లు షెంగ్, హొనాన్ వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో రమిత తృటిలో పతకం చేజార్చుకుంది. శుక్రవారం జరిగిన పోటీల్లో రమిత నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ మెగాటోర్నీలో చైనా ఐదు స్వర్ణాలతో అగ్రస్థానంలో ఉండగా.. భారత్ (ఒక స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్యాలు) రెండో స్థానంలో కొనసాగుతున్నది.