Ravichandran Ashwin | దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో అశ్విన్ 853 పాయింట్లతో టాప్ ర్యాంక్ నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టిన అశ్విన్ తన ర్యాంకింగ్ పాయింట్లను మరింత మెరుగుపర్చుకున్నాడు. ఆరు వికెట్లతో రాణించిన బుమ్రా (825) నాలు గో ర్యాంక్కు చేరుకోగా, జడేజా (754) ఆరో ర్యాంక్లో ఉన్నా డు. బ్యాటింగ్లో విలియమ్సన్ (864) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, విరాట్ కోహ్లీ (767) ఒక్కడే ఆరో ర్యాంక్లో ఉన్నాడు.