బాకు(అజర్బైజాన్): ప్రతిష్ఠాత్మక ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో భారత గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో విదిత్ 2-0 తేడాతో రష్యా జీఎం ఇయాన్ నెపోనియాచీపై అద్భుత విజయం సాధించాడు.
విదిత్తో పాటు ఇరిగేసి అర్జున్, గుకేశ్, ప్రజ్ఞానంద..క్వార్టర్స్లోకి ప్రవేశించారు. టోర్నీలో ఒకే దేశానికి చెందిన నలుగురు జీఎంలు క్వార్టర్స్లోకి దూసుకెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.