న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు టీ 20 సిరీస్ను భారతజట్టు కైవసం చేసుకుంది. వర్షం కారణంగా మూడో టీ20ని అంపైర్లు టైగా ప్రకటించారు. దాంతో, రెండో టీ 20లో గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా సిరీస్ విజేతగా నిలిచింది. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 9 ఓవర్లకు భారత జట్టు 75 పరుగుల చేయడంతో మ్యాచ్ను టైగా ప్రకటించారు.
మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 19.4 ఓవరల్లో 160 పరుగులకు అలౌట్ అయింది. ఓపెనర్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్ (54) అర్థ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్, అర్ష్దీప్ సింగ్ నాలుగేసి వికెట్లు తీశారు. నాలుగు వికెట్ల ప్రదర్శనతో ఇంగ్లండ్ను దెబ్బతీసిన మహమ్మద్ సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్లో మెరుపు సెంచరీతో కలిపి 127 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. మూడు ఫార్మాట్లలో కలిపి ఇది భారత్కు పదో సిరీస్ విజయం.