IND vs BAN : మొదటి టెస్టులో భారత్ విజయం వైపు పయనిస్తోంది. లెగ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి బంగ్లాను దెబ్బ కొట్టాడు. 87వ ఓవర్ మొదటి బంతికే కీలకమైన ముఫ్ఫికర్ రహీం (23)ను అక్షర్ బౌల్డ్ చేశాడు. ఆ ఓవర్ చివరి బంతికి నురుల్ హసన్ స్టంప్ అవుట్ అయ్యాడు. అంతకు ముందు యాసిర్ అలీని పెవిలియన్కు పంపి అక్షర్ భారత్కు బ్రేక్ ఇచ్చాడు. ఓవర్నైట్ స్కోర్ 42తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాకు ఓపెనర్లు శాంటో, జకిర్ హసన్ శుభారంభం ఇచ్చారు. 67 రన్స్ చేసిన శాంటో, ఉమేశ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జకిర్ దూకుడుగా ఆడి సెంచరీ సాధించాడు. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం షకిబుల్ హసన్ 32, మెహిదీ హసన్ మిరాజ్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్లో గెలవాలంటే 260 పరుగులు చేయాలి. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. భారత బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీసి బంగ్లా మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఆఖరి సెషన్లో మరో రెండు వికెట్లు తీస్తే.. భారత్ విజయం ఖరారైనట్టే.
మొదటి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 150కి ఆలౌట్ అయింది. దాంతో భారత్కు 221 పరుగుల అధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (110), వైస్ కెప్టెన్ పూజారా (102) సెంచరీలతో కదం తొక్కారు. దాంతో 258 రన్స్ వద్ద కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.