దుబాయ్: నిరుడు మహిళల ప్రపంచకప్నకు ఆతిథ్యమిచ్చిన భారత్.. వచ్చే ఏడాది మరో మేజర్ టోర్నీని నిర్వహించనుంది. ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మహిళల చాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్ ఆతిథ్య హక్కులు భారత్కు దక్కాయి. వాస్తవానికి ఈ టోర్నీని శ్రీలంకలో జరగాల్సి ఉండగా ఆ దేశ క్రికెట్ బోర్డు పరిపాలనా వ్యవహారాల కారణంగా అక్కడ్నుంచి తరలించారు. ఈ టోర్నీ నిర్వహణ కోసం బంగ్లాదేశ్, సౌతాఫ్రికా పోటీపడ్డా భారత్కే ఆతిథ్య హక్కులు దక్కాయి. ఫిబ్రవరి 14 నుంచి 28 మధ్య ముంబైలోని సీసీఐ, వడోదర వేదికలుగా ఈ టోర్నీ జరుగుతుంది. టీ20 ఫార్మాట్లో నిర్వహించబోయే ఈ టోర్నీలో ర్యాంకింగ్స్ ఆధారంగా టాప్-6లో ఉన్న (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక) జట్లు తలపడతాయి.