ఈ నెలాఖరున జరిగే సౌతాఫ్రికా టూర్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 26న భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో రెండు జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20 మ్యాచులపై ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయించుకున్నాయి.
ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ఇప్పటికే 21 మంది సభ్యులతో టెస్టు సిరీస్కు జట్టును ప్రకటించింది. ఈ క్రమంలోనే భారత జట్టు కూడా తమ బృందాన్ని వెల్లడించింది. మొత్తం 18 మందితో భారత టెస్టు జట్టును బీసీసీఐ ప్రకటించింది. న్యూజిల్యాండ్ సిరీస్కు ఎంపికవ్వని హనుమ విహారిని సౌతాఫ్రికా టూర్కు ఎంపిక చేసింది. అయితే ఇప్పటికే గాయాలు, రిహాబిలేషన్లో ఉన్న కారణాలతో రవీంద్ర జడేజా, శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, రాహుల్ చాహర్లు సెలెక్షన్కు అందుబాటులో లేరని బీసీసీఐ వెల్లడించింది.
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్.
స్టాండ్ బై ఆటగాళ్లు: నవదీప్ సైని, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నాగ్వస్వాల్ల