భువనేశ్వర్: హాకీ జూనియర్ ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సొంతగడ్డపై తిరిగి టైటిల్ను నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న భారత్..పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో టీమ్ఇండియా 1-0 తేడాతో బెల్జియంపై అద్భుత విజయం సాధించింది. 2016లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో బెల్జియంను మట్టికరిపించి టైటిల్ ఒడిసిపట్టుకున్న యువ భారత్ ఈసారి క్వార్టర్స్లోనే భరతం పట్టింది. ఇరు జట్లు హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో భారత్ తరఫున శార్దనంద్ తివారీ(21ని) పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచాడు. శుక్రవారం జరిగే సెమీస్లో ఆరు సార్లు చాంపియన్ జర్మనీతో భారత్ తలపడుతుంది. ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య మరో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది.