IND vs SL : భారత బౌలర్లు విజృంభించడంతో శ్రీలంక మూడో వన్డేలో ఓటమి అంచుల్లో ఉంది. షమి వేసిన 16వ ఓవర్లో వెల్లలాగే 8వ వికెట్గా వెనుదిరిగాడు. సూర్యకుమార్ క్యాచ్ పట్టడంతో వెల్లలాగే ఇన్నింగ్స్ ముగిసింది. అంతకు ముందు ఓవర్లో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ భారత్కు ఏడో వికెట్ అందించాడు. అతని బౌలింగ్లో లంక కెప్టెన్ దసున్ షనక బౌల్డ్ అయ్యాడు. బంతిని డిఫెండ్ చేయబోయిన అతడిని కుల్దీప్ బోల్తా కొట్టించాడు. దాంతో, ఆశ్చర్యపోయిన షనక పెవిలియన్ బాట పట్టాడు. 17 ఓవర్లు పూర్తయ్యే సరికి శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 55పరుగులు చేసింది. లహిరు కుమార, కసున్ రజిత క్రీజులో ఉన్నారు.