వెటరన్ ఓపెనర్ క్వింటన్ డీకాక్ (101 నాటౌట్ ) సెంచరీతో చెలరేగడంతో భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో సఫారీ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. మరో ఓపెనర్ జానెమన్ మలాన్ (1), కెప్టెన్ టెంబా బవుమా (8), ఎయిడెన్ మార్క్రమ్ (15) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరిన వేళ.. డీకాక్ జట్టును ఆదుకున్నాడు.
తనదైన స్ట్రోక్ ప్లేతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 36వ ఓవర్ మూడో బంతికి సెంచరీ పూర్తి చేశాడు. అతనికి రాసీ వాన్ డర్ డస్సెన్ (40 నాటౌట్) చక్కటి సహకారం అందిస్తున్నాడు. అతను కూడా అర్ధశతకానికి దగ్గరలో ఉన్నాడు. సూపర్ ఫామ్లో ఉన్న వీళ్లిద్దరూ బ్యాట్ ఝుళిపిస్తే భారత్ ముందు భారీ లక్ష్యం ఖాయంగా కనిపిస్తోంది. 31 ఓవర్లు ముగిసే సరికి సఫారీలు 174/3 స్కోరుతో నిలిచారు.