సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టులో భారత బ్యాటర్లు సరిగా ఆడలేకపోతున్నారు. తొలి నాలుగు వికెట్లను స్వల్పస్కోరుకే కోల్పోయిన భారత్ను కోహ్లీ, పంత్ జోడీ ఆదుకుంది. కోహ్లీ పెద్దగా పరుగులు చేయకపోయినా ఒక ఎండ్లో అడ్డుగోడలా నిలిచి, పంత్కు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించాడు.
దీంతో అద్భుతంగా ఆడిన పంత్ తన జోరు కొనసాగిస్తున్నాడు. అయితే ఎన్గిడీ బౌలింగ్లో ఆఫ్సైడ్ వెళ్తున్న బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ కూడా మరోసారి బ్యాటుతో నిరాశపరిచాడు.
వచ్చినప్పటి నుంచే అనవసర షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన అశ్విన్.. ఎన్గిడీ బౌలింగ్లో లూజ్ షాట్ ఆడాడు. దీంతో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి నేరుగా గల్లీ ఫీల్డర్ వైపు వెళ్లింది. సులభమైన క్యాచ్ అందుకున్న జాన్సెన్.. అశ్విన్ను పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది.
ఇంకా భారత ఆధిక్యం 176 పరుగులే. కనీసం ఇంకో 70-80 పరుగులు చేస్తే కానీ బౌలర్లకు పది వికెట్లు తీసే ఛాన్స్ ఉండదని నిపుణులు అంటున్నారు. మరి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసిన కోహ్లీ కూడా అవుటవడంతో.. భారత బ్యాటింగ్ ఆర్డర్ ఏమాత్రం పోరాడుతుందో చూడాలి. ప్రస్తుతం భారత జట్టుకు కావలసిన స్కోరు అందించే బాధ్యత పంత్పైనే ఉంది.