భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. ఆరంభంలోనే అర్షదీప్ బౌలింగ్లో బాబర్ ఆజమ్ (0), మహమ్మద్ రిజ్వాన్ (4) వికెట్లు కోల్పోయిన ఆ జట్టును షాన్ మసూద్ (29 నాటౌట్), ఇఫ్తికార్ అహ్మద్ (21 నాటౌట్) ఆదుకున్నారు. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.
అదే సమయంలో అవకాశం దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నారు. దీంతో ఆ జట్టు బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. వీళ్లిద్దరూ జాగ్రత్తగా ఆడుతుండటంతో పది ఓవర్లు ముగిసే సరికి పాక్ జట్టు 60/2 స్కోరుతో నిలిచింది.