హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) తాత్కాలిక చైర్మన్గా ప్రొఫెసర్ చింతా సాయిలు నియమితులయ్యారు. టీఎస్పీఎస్సీ తాత్కాలిక చైర్మన్గా ఉన్న కృష్ణారెడ్డి పదవీకాలం పూర్తి కావడంతో టీఎస్పీఎస్సీలో మిగిలిన ఏకైక సభ్యుడు సాయిలు తాత్కాలిక చైర్మన్గా నియమితులయ్యారు. పూర్తిస్థాయి చైర్మన్ను నియామకం జరిగే వరకు సాయిలు ఈ పదవీలో కొనసాగనున్నారు. గడిచిన డిసెంబర్ నుంచి టీఎస్సీఎస్సీ తాత్కాలిక చైర్మన్తో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.