ICC Womens T20 World Cup 2023 | ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తు చేసిన మన అమ్మాయిలు తర్వాతి మ్యాచ్లో వెస్టిండీస్ భరతం పట్టారు. సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఇదే జోరులో హర్మన్ సేన ఇంగ్లాండ్ జట్టుతో కీలకపోరుకు సిద్ధమైంది. గ్రూపు-2లో భాగంగా మరికొన్ని గంటల్లో ఇంగ్లాండ్తో భారత్ తలపడుతుండగా.. ఈ మ్యాచులో గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్ చేరుకుంటుంది. రిచా ఘోష్, హర్మన్ప్రీత్కౌర్ బాధ్యతాయుత బ్యాటింగ్తో ఈ ప్రపంచకప్లో రాణిస్తుండగా, ఇంగ్లాండ్ పై కూడా అదే జోరు కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు .
మరోవైపు ఇంగ్లాండ్ కూడా రెండు మ్యాచులు గెలిచి భారత్తో సమంగా ఉంది.. దీంతో హర్మన్ సేనకు ఇంగ్లిష్ జట్టుతో గట్టి పోటే ఎదురవ్వనుంది. దక్షిణాఫ్రికాలోని గెబెరా వేదికగా సాయంత్రం 6.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
తుది జట్ల అంచనా
భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్(C), రిచా ఘోష్(W), దేవికా వైద్య, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్, షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్.
ఇంగ్లండ్ జట్టు: నైట్(C), అమీ జోన్స్(W), కేథరీన్ స్కివర్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, షార్లెట్ డీన్, సారా గ్లెన్, లారెన్ బెల్, సోఫియా డంక్లీ, డేనియల్ వ్యాట్, అలిస్ క్యాప్సే, నాట్ స్కివర్ బ్రంట్, హీథర్.