కాబుల్ : వచ్చేనెలలో భారత్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనున్న అఫ్గానిస్థాన్కు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఇన్నాళ్లూ రషీద్ ఖాన్ గైర్హాజరీలో తాత్కాలిక సారథిగా వ్యవహరించిన ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్.. సెప్టెంబర్ 13 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్ నుంచి పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఈ మేరకు 15 మందితో కూడిన జట్టును అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) సోమవారం ప్రకటించింది. రెండేండ్ల క్రితం గాయంతో జట్టుకు దూరమైన పేసర్ నవీన్ ఉల్ హక్ టీమ్లోకి పునరాగమనం చేశాడు.
అఫ్గాన్ జట్టు: జద్రాన్ (కెప్టెన్), గుర్బాజ్, నూర్ రెహ్మాన్, సెదికుల్లా, రసూలి, అజ్మతుల్లా, గుల్బాదిన్, నబీ, రషీద్, ఖరోటి, నూర్ అహ్మద్, ముజీబ్, ఫరూఖీ, అహ్మద్జాయ్, నవీన్ ఉల్హక్