బ్లూమ్ఫాంటైన్: మిడిలార్డర్ ఆటగాళ్లు ఇషాన్ కిషన్ (86 బ్యాటింగ్; 12 ఫోర్లు, ఒక సిక్సర్), హనుమ విహారి (63; 6 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించడంతో దక్షిణాఫ్రికా-‘ఎ’తో జరుగుతున్న అనధికారిక టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్-‘ఎ’6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. సఫారీ టూర్ కోసం ఎంపిక చేయనున్న భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న విహారి చక్కటి ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటే.. ఇషాన్ కిషన్ దూకుడు కనబర్చాడు. ప్రస్తుతం చేతిలో 4 వికెట్లు ఉన్న భారత జట్టు.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 39 పరుగులు వెనుకబడి ఉంది. ఇషాన్తో పాటు దీపక్ చాహర్ (10) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 249/7తో మంగళవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా-‘ఎ’268 పరుగులకు ఆలౌటైంది. మన బౌలర్లలో దీపక్ చాహర్ 4, నవ్దీప్ సైనీ మూడు వికెట్లు పడగొట్టారు.