చండీగఢ్: భారత మాజీ ఆటగాడు గుర్కీరత్ సింగ్ మాన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమ్ఇండియా తరఫున మూడు వన్డేలు ఆడిన గుర్కీరత్ మిడిలార్డర్లో బ్యాటింగ్తో పాటు.. ఆఫ్ స్పిన్నర్గా సేవలందించాడు. 2016లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 33 ఏండ్ల గుర్కీరత్ భారత జట్టులో చోటు దక్కించుకోగా.. మూడు మ్యాచ్ల్లో కలిపి 13 పరుగులు చేశాడు.
పంజాబ్ జట్టులో చోటు కోల్పోవడంతో గుర్కీరత్ శుక్రవారం ఆటకు వీడ్కోలు పలికాడు. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీతో పాటు.. రంజీ ట్రోఫీలో రాణించి జాతీయ సెలెక్టర్ల దృష్టిలో పడ్డ గుర్కీరత్ అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగించలేక జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేక పోయాడు. టెస్టు జట్టు తరఫున కూడా పిలుపు అందుకున్నప్పటికీ అతడికి అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన గుర్కీరత్.. నిరుడు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ టీమ్లోనూ సభ్యుడిగా ఉన్నాడు.