టొరంటో: ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. శుక్రవారం ముగిసిన ఓపెన్ 12వ రౌండ్లో గుకేశ్.. అజర్బైజాన్కు చెందిన నిజత్ అబసోవ్ను ఓడించాడు. దీంతో గుకేశ్.. 7.5 పాయింట్లతో నెపొనియాచి, హికారు నకమురాతో సంయుక్తంగా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
మరోవైపు నెపొనియాచి చేతిలో ప్రజ్ఞానంద.. ఫాబియానో కరునావా చేతిలో విదిత్ ఓటమిపాలవడంతో ఆ ఇద్దరూ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించారు. మహిళల విభాగంలో హంపి..గొర్యచెంకాతో గేమ్ను డ్రా చేసుకోగా, అన్నా ముజిచుక్పై వైశాలి గెలిచింది.