న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత మహిళా బాక్సర్లు దుమ్మురేపారు. ఫైనల్లో బరిలోకి దిగిన ఐదుగురిలో నలుగురు అమ్మాయిలు స్వర్ణాలతో మెరిశారు. జోర్డాన్ వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహై (75 కేజీలు), పర్వీన్ (63 కేజీలు), సవీటి (81 కేజీలు), అల్ఫియా (ప్లస్ 81 కేజీలు) పసిడి పతకాలు చేజిక్కించుకున్నారు. మీనాక్షి (52 కేజీలు) రజతం కైవసం చేసుకుంది. లైట్ వెయిట్ నుంచి బయటకు వచ్చి 75 కేజీల విభాగంలో తొలిసారి బరిలోకి దిగిన లవ్లీనా శుక్రవారం జరిగిన ఫైనల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ సోఖిబాపై ఏకపక్ష విజయం నమోదు చేసుకుంది. పర్వీన్ 5-0తో కిటో మాయి (జపాన్)పై, సవీటి 5-0తో గులాస్య (కజకిస్థాన్)పై, అల్ఫియా 5-0తో ఇస్లామ్ హుసైలీ (జోర్డాన్)పై విజయాలు సాధించారు. శనివారం పురుషుల ఫైనల్ బౌట్లు జరుగనున్నాయి.