బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంట కరోనా కలకలం చెలరేగింది. కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో కోల్కతాలోని వుడ్లాండ్స్ మల్టీస్పెషాలిటీ హాప్పిటల్లో ఆయన్ను చేర్పించారు. అక్కడ మూడు రోజులపాటు చికిత్స తీసుకున్న గంగూలీ.. డిసెంబరు 31న డిశ్చార్జి అయ్యారు. ఆయనకు ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా? అని కూడా పరీక్షలు జరపగా నెగిటివ్ ఫలితం వచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా గంగూలీ కుటుంబంలో మరో నలుగురికి కరోనా సోకింది. వీరిలో గంగూలీ కుమార్తె సనా కూడా ఉన్నట్లు సమాచారం. గత డిసెంబరు 28న గంగూలీ కరోనా పాజిటివ్గా తేలారు. ఇప్పుడు ఆయన కుమార్తె, కుటుంబంలోని మరో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఫలితం వచ్చింది.
అయితే వీరెవరిలోనూ కరోనా లక్షణాలు లేవు. అసింప్టమాటిక్గా ఉన్న వీరంతా ఇంటిలోనే సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నారు. కాగా, గంగూలీ భార్య దోనా గంగూలీకి కరోనా సోకలేదు.