రోటర్డామ్: యూరప్ ఖండంలో క్రికెట్ను విస్తరించేందుకు గాను ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ఆరు యూరోపియన్ నగరాల్లో నిర్వహించనున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్)లో దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాలు జాంటీ రోడ్స్, ఫాఫ్ డుప్లెసిస్తో పాటు హెన్రిచ్ క్లాసెన్తో కూడిన త్రయం.. ఐదో ఫ్రాంచైజీని కొనుగోలు చేయనుంది.
ఈ మేరకు కన్సార్షియంగా ఏర్పడ్డ ఈ దిగ్గజాలకు నగరానికి చెందిన మధుకర్ శ్రీ జతకలిశారు. ఐదో ఫ్రాంచైజీలో ఆయన ఈ త్రయంతో కలిసి మేనేజింగ్ పార్ట్నర్గా చేరారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఈటీపీఎల్కు సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు.