మాహె: ఫుట్బాల్ అంటే ఆమెకు ఎంత అభిమానం అంటే.. ఒంటరిగా ఖతార్కు ప్రయాణం చేసేంత! కేరళలోని మాహె సమీపంలోని గ్రామానికి చెందిన నాజి నౌషి అనే మహిళ ఖతార్లో జరిగే ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను చూసేందుకు తన సొంత కారులో ఒంటరిగా బయలుదేరింది. ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఆంటోని రాజు ప్రారంభించడం విశేషం. అయిదుగురు పిల్లల తల్లి అయిన నౌషి థార్ మోడల్ కారులో సాహసయాత్రకు పూనుకున్నది. కోయంబత్తూర్ మీదుగా ముంబై చేరుకున్న తరువాత సముద్రం మీదుగా ఒమన్ చేరుకుని, అక్కడి నుంచి బహ్రెయిన్, కువైట్, సౌదీ మీదుగా ఖతార్ చేరుకోనున్నది. డిసెంబర్ 10 నాటికి ఖతార్ చేరుకుని 31వ తేదీ వరకు ఫుట్బాల్ మ్యాచ్లను వీక్షించాలన్నది ఆమె ఆకాంక్ష. ప్రయాణంలో అవసరమైన వంట సామాగ్రి అంతటినీ వెంట తీసుకెళ్తున్నది.