Prithvi Shaw | క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw)పై దాడి చేసి అతని కారును ధ్వంసం చేసిన కేసులో
అరెస్టయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ (Social media influence), భోజ్పురి (Bhojpuri actress) నటి సప్నా గిల్ (Sapna Gill)ను శనివారం కోర్టు ముందు హాజరుపరిచారు. అంధేరీ కోర్టు (Andheri court) ఆమెకు ఫిబ్రవరి 20వ తేదీ వరకు పోలీసు కస్టడీ విధించింది. ఈ సందర్భంగా పృథ్వీ షా ఎవరో తనకు తెలియదని సప్నా గిల్ కోర్టుకు తెలిపింది.
‘పృథ్వీ షాను నా స్నేహితుడు శోభిత్ ఠాకూర్ సెల్ఫీ అడిగాడు. పృథ్వీ షా ఎవరో నాకు తెలియదు. అతను
క్రికెటర్ అని కూడా తెలియదు. మేము ఇద్దరమే ఉన్నాం. పృథ్వీ షాతో పాటు ఎనిమిది మంది స్నేహితులు
ఉన్నారు. ఆ సమయంలో పృథ్వీ షా తాగి ఉన్నారు’ అని సప్నా గిల్ కోర్టుకు తెలిపింది.
మరోవైపు కోర్టులో సప్నా గిల్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పృథ్వీ షాకు మద్యం అలవాటు
ఉందని.. అందుకే బీసీసీఐ(BCCI) అతనిపై నిషేధం విధించిందని మీడియాలో వచ్చిన కథనాలను కోర్టు
ముందు ఉంచారు. అదేవిధంగా పృథ్వీ నుంచి సప్నా గిల్ రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు వస్తున్న
ఆరోపణలను న్యాయవాది ఖండించారు. రూ.50 వేలు ఇవ్వాలంటూ తన క్లయింట్ సప్నాగిల్ బెదిరించినట్లు
పృథ్వీ షా బృందం చేసిన ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఘటన జరిగిన 15 గంటల తర్వాత పృథ్వీ షా స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది చెప్పారు. వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.