వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడుతానని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్పష్టంచేశాడు. ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన చెన్నై శుక్రవారం లీగ్లో ఆఖరి మ్యాచ్ ఆడగా.. టాస్ సమయంలో ధోనీ భవిష్యత్తు ప్రణాళికలను వివరించాడు. ‘కచ్చితంగా వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడుతా. చెన్నైలో ఆడకుండా అభిమానులకు ధన్యవాదాలు చెప్పడం అన్యాయం. 2023 సీజన్ నాకు చివరి ఏడాది అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేను. వచ్చే ఏడాది సీజన్లో మరింత బలంగా తిరిగి వస్తాం’అని ధోనీ అన్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన 40 ఏండ్ల ధోనీ ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు.