మెల్బోర్న్ : ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)తో పాటు యాషెస్ సిరీస్కు ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల కాలంలో ఫామ్ కోల్పోయిన వార్నర్ స్థానంపై ఊహాగానాలకు తెరదించుతూ క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం 17మంది సభ్యుల జట్టును ప్రకటించింది. వార్నర్తోపాటు ఓపెనింగ్ స్థానానికి పోటీపడుతున్న మార్కస్ హారిస్, మాట్ రెన్షా, ఉస్మాన్ ఖవాజాకూడా జట్టులో చోటు సంపాదించారు. యాషెస్ సిరీస్ జూన్ 16న ఆరంభం కానున్నది. తొలి రెండు టెస్టుల్లో ప్రదర్శనతో డబ్ల్యూటీసీ టోర్నీకి తుది జట్టును ప్రకటించనున్నారు.