ఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలిచి
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తో
జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్షోతో అదరగొట్టిన చెన్నై సూపర్ విక్టరీ సాధించింది. ఐతే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఢిల్లీ చేరుకున్న చెన్నై టీమ్ హోటల్లో పసందైన విందు భోజనం టేస్ట్ చేసింది.
టేబుల్ మీద ఫేమస్ ‘బుఖారా నాన్’ ఉండగా తీసిన ఫొటోను సురేశ్ రైనా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. వెల్కమ్ టూ ఢిల్లీ, రంజాన్ ముబారక్ అంటూ ట్వీట్ చేశాడు. ఫ్యామిలీ నాన్ను ఒకే సిట్టింగ్లో 4-5 మంది ఈజీగా తినొచ్చు. చెన్నై సహచర ఆటగాళ్లు మొయిన్ అలీ, ఇమ్రాన్ తాహిర్, దీపక్చాహర్లతో బుఖారా నాన్ను రైనా రుచి చూశాడు. వ్యక్తిగతకారణాలతో గతేడాది ఐపీఎల్కు దూరమైన రైనా ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్నాడు.