Dhoni, Kohli | చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్లో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్లో ఆడిన టీమ్తోనే బరిలోకి దిగుతున్నట్టు తెలిపాడు. అటు బెంగళూరు ఇద్దరు ప్లేయర్లను రీప్లేస్ చేసింది. సచిన్ బేబీ స్థానంలో నవదీప్ సైనీ, కైల్ జేమీసన్ స్థానంలో టిమ్ డేవిడ్ ఆడుతున్నట్టు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు.
అటు.. పాయింట్ల పట్టికలో చెన్నై 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, బెంగళూరు 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. చెన్నై ఈ మ్యాచ్ గెలిస్తే తొలిస్థానంలోకి వెళ్తుంది.