చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న రోహిత్ శర్మ (18) పెవిలియన్ చేరాడు. సిమర్జీత్ సింగ్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి అతను పెవిలియన్ చేరాడు. ఐదో స్టంప్ మీదకు వేసిన గుడ్ లెంగ్త్ బాల్ను ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్.. బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు.
దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని మొయీన్ అలీ క్యాచ్ పట్టేశాడు. అంతకుముందు ఇషాన్ కిషన్ (6) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరడంతో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలకెత్తుకున్న రోహిత్.. కొన్ని మంచి షాట్లు ఆడాడు. నాలుగు ఫోర్లు బాదిన అతను 14 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కాసేపటికే డానియల్ శామ్స్ (1), ట్రిస్టన్ స్టబ్స్ (0)ను కూడా ముకేష్ చౌదరి పెవిలియన్ చేర్చాడు. ఒకే ఓవర్లో ఇద్దరినీ ఎల్బీగా అవుట్ చేశాడు.