చెన్నె: నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీ అందించిన మహేంద్ర సింగ్ ధోనీని చెన్నె సూపర్ కింగ్స్ (సీఎస్కే) వదులుకోవడం లేదు. వచ్చే సీజన్లో ధోనీ తమతోనే ఉంటాడని సీఎస్కే యాజమాన్యం ఆదివారం ప్రకటించింది. తొలి రిటెన్షన్ కార్డును ధోనీ కోసమే వినియోగిస్తామని స్పష్టం చేసింది. అయితే మెగా వేలంలో రిటెన్షన్ విధానాల పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.