IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 17వ సీజన్ ప్రారంభానికి ముందే వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్యే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఎతిహద్ ఎయిర్వేస్ (Etihad Airways) కంపెనీకి స్పాన్సర్షిప్ హక్కులు కట్టబెట్టిన సీఎస్కే.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్(Katrina Kaif)ను ఎంపిక చేసింది. అయితే.. ఈ విషయాన్ని చెన్నై మేనేజ్మెంట్ అధికారింగా వెల్లడించలేదు.
సీఎస్కే కొత్త స్పాన్సర్ ఎతిహద్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కత్రినా.. ధోనీ సేనకు ప్రచారకర్తగా వ్యవహరించనుంది. ధూమ్, టైగర్ జిందా, బాంగ్ బాంగ్, సింగ్ ఈజ్ కింగ్ వంటి సినిమాలతో పాపులర్ అయిన కత్రినా.. బాలీవుడ్ హీరో, ‘ఉరి'(Uri) ఫేమ్ విక్కీ కౌశల్ను 2021లో పెండ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
Big news coming up..#KatrinaKaif become the brand ambassador of biggest #IPL team @ChennaiIPL 🔥🔥
Also #CSK jersey being changed this time now. #ChennaiSuperKings #Katrina #Dhoni #IPL pic.twitter.com/EiL1hyEpn0
— Ashish Robinhood Pandey (@ashispandey1693) February 10, 2024
ఐపీఎల్ 17వ సీజన్ను మార్చి 23న ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోంది. ఈసారి చెన్నై డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. నిరుడు అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో ధోనీ సేన గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.