రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిల్యాండ్ వెళ్లిన బంగ్లాదేశ్ జట్టుకు షాక్. ఆ జట్టు బౌలింగ్ కోచ్ రంగన హెరాత్ కరోనా పాజిటివ్గా తేలాడు. ఈ శ్రీలంక మాజీ ఆటగాడు లంక తరపున 433 టెస్టు వికెట్లు కూల్చి రికార్డుల్లోకెక్కాడు. అతను ప్రస్తుతం బంగ్లా బౌలింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా న్యూజిల్యాండ్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగాల్సి ఉంది. దీనికోసం బంగ్లా జట్టు క్రీస్ట్చర్చ్ చేరుకుంది. ఇక్కడకు వచ్చిన విమానంలో హెరాత్తోపాటు మరో వ్యక్తికి కూడా కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో బంగ్లా జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లను ఐసోలేషన్లో ఉంచారు.
మిగతా ఆటగాళ్లు లింకన్లో ప్రాక్టీస్ ప్రారంభించారు. అయితే వీళ్లంతా హెరాత్కు సమీపంలో ఉన్నందువల్ల వీరందరూ కూడా మూడు రోజులు క్వారంటైన్లో ఉండాలని న్యూజిల్యాండ్ ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.
హెరాత్ తప్ప మిగతా బృందానికి మరోసారి కరోనా పరీక్షలు చేశారు. వీరందరికీ నెగిటివ్ ఫలితమే వచ్చింది. అయితే మూడు రోజుల క్వారంటైన్ తర్వాతే జట్టు తమ ట్రైనింగ్ ప్రారంభించాల్సి ఉంటుంది.