న్యూఢిల్లీ : భారత మహిళా క్రికెటర్ తానియా భాటియాకు చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా తన హోటల్ గదిలో డబ్బు, విలువైన నగలు, గడియారం చోరీకి గురైనట్లు సోమవారం సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించింది.
తాము బసచేసిన మారియట్ హోటల్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి వస్తువులను దొంగలించినట్లు తానియా పేర్కొంది. ఇది కచ్చితంగా భద్రతా లోపమని స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది.