హైదరాబాద్, ఆట ప్రతినిధి: మైసూర్లోని ప్రతిష్ఠాత్మక ఆర్మీ బాయ్స్ స్పోర్ట్స్ సెయిలింగ్ స్కూల్కు రాష్ర్టానికి చెందిన బన్నీ బొంగూరు, అక్షయ్కుమార్ ప్రాథమికంగా ఎంపికయ్యారు. జహీరాబాద్లోని నిరుపేద రైతు కుటుంబానికి చెందిన బన్నీ బొంగూరు జాతీయ స్థాయి సెయిలింగ్లో నిలకడగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం జాతీయ రెండో ర్యాంక్లో ఉన్న బన్నీ.. డ్రైవర్ కుమారుడైన అక్షయ్ యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్(వైసీహెచ్)లో కోచ్ సుహేమ్ షేక్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. బన్నీ, అక్షయ్.. స్పోర్ట్స్ స్కూల్లో ఎంపిక ప్రక్రియ చివర్లో ఉన్నారు. క్లిష్టమైన ఈ దశ తర్వాత ఢిల్లీలోని ఆర్మీ సెలెక్షన్ కమిటీ నుంచి కాల్ లెటర్ రావాల్సి ఉంది. ఆర్మీ స్పోర్ట్ స్కూల్కు బన్నీ, అక్షయ్ ఎంపిక కావడం పట్ల కోచ్ సుహేమ్ షేక్ సంతోషం వ్యక్తం చేశారు. వీరి కంటే ముందు వైసీహెచ్ నుంచి 21 మంది సెయిలర్లు ఎంపికయ్యారని ఆయన పేర్కొన్నారు. కాల్ లెటర్ వచ్చిన తర్వాత మైసూర్లోని ఎంఈజీ సెంటర్, తృష్ణ సెయిలింగ్ క్లబ్ నుంచి ఆర్మీ కోచ్ల పర్యవేక్షణలో బన్నీ, అక్షయ్ శిక్షణ పొందనున్నారు. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో సత్తాచాటి మంచి పేరు దక్కించుకునే అవకాశం లభిస్తుంది.