జైపూర్: యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) ఇప్పుడో పెద్ద హిట్టర్. ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లోనూ ఆ బ్యాటర్ భారీ స్కోర్లు చేసిన విషయం తెలిసిందే. జైశ్వాల్ కొట్టే షాట్లకు.. బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ఆడుతున్న ఆ కుర్రాడి గురించి.. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఓ స్టన్నింగ్ విషయాన్ని చెప్పాడు. జైశ్వాల్ బ్యాటింగ్ను చాలా ఇష్టపడుతాడని, ఇక అతను నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బౌలర్లను వెనక్కి రప్పించేవాళ్లమని శాంసన్ తెలిపాడు.
జైశ్వాల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. కొందరు బౌలర్లు అతిగా బౌలింగ్ చేసేవారని, దాని వల్ల వాళ్ల భుజాలు దెబ్బతీనేవన్నారు. లాస్ట్ సీజన్లో జైశ్వాల్ తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడని, ఆ సమయంలో అతనికి బౌలింగ్ చేసిన బౌలర్ల భుజాలు డిస్లొకేట్ అయినట్లు శాంసన్ చెప్పాడు.
ఆ బౌలర్లు కొన్నాళ్లు ఆస్పత్రుల్లో ఉన్నారని, ఆటగాళ్ల కన్నా.. జైశ్వాల్ వల్ల సిబ్బందికే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నట్లు శాంసన్ తెలిపాడు. గత నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను జైశ్వాల్ గెలుచుకున్నాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ రన్స్ స్కోరింగ్లో అతను లీడింగ్లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్లో రెండు డబుల్ సెంచరీలు చేశాడతను.
JaisBall mode at SMS! 🔥💪 pic.twitter.com/iDczUp00xv
— Rajasthan Royals (@rajasthanroyals) March 19, 2024