హైదరాబాద్, ఆట ప్రతినిధి: జవహర్లాల్ నెహ్రూ 57వ జాతీయ సీనియర్ హాకీ టోర్నీలో మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. గూంచా ఏస్టేట్స్ ఆధర్వ్యంలో గురువారం జరిగిన మ్యాచ్లో పంజాజ్ నేషనల్ బ్యాంక్ 4-2 తేడాతో దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్)పై ఘన విజయం సాధించింది. ఆది నుంచి ఆసక్తికరంగా సాగిన పోరులో పంజాబ్ జట్టు అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది. ప్రత్యర్థి బలహీనతలను సొమ్ముచేసుకుంటూ కీలక సమయాల్లో గోల్స్ చేసింది. ముఖ్యంగా భగత్సింగ్ ధిల్లాన్(20ని, 54ని, 58ని) హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించాడు. మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ముగుస్తుందనగా భగత్సింగ్ చేసిన రెండు పెనాల్టీ కార్నర్ గోల్స్తో పంజాబ్ విజయాన్ని సొంతం చేసుకుంది. పంజాబ్ తరఫున నవీన్ అనిల్(41ని) మరో గోల్ చేశాడు. అయ్యప్ప ప్రాంజన్(3ని), ప్రతాప్ లక్రా(49ని) ఎస్సీఆర్కు రెండు గోల్స్ అందించారు. మరో మ్యాచ్లో ఇండియన్ నేవీ 1-0తో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్పై గెలిచింది. నేవీ తరఫున జుగ్రాజ్ సింగ్(56ని) ఏకైక గోల్ చేశాడు.