మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మే 13న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగగంగా జరుగుతుంది.గత షెడ్యూల్ను మారేడుమిల్లిలో పూర్తి చేసిన చిత్ర బృందం ఇప్పుడు ఇల్లెందు ఓపెన్ కాస్ట్లో షూటింగ్ జరుపుతుంది.
ఆదివారం మొదలైన తాజా షెడ్యూల్ ఈ నెల 11 వరకు ఉంటుందట. మొదటి రోజు భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు జేకే 5 ఓపెన్కాస్టులో ‘ఆచార్య’ సినిమా క్లైమాక్స్ సీన్ చిత్రీకరించారు. ఇందులో భీకర పోరాట దృశ్యాల చిత్రీకరణ జరిగింది.అయితే చిరంజీవితో పాటు రామ్ చరణ్లకు వారం రోజుల పాటు ఆతిథ్యం ఇచ్చారు మంత్రి పువ్వాడ అజయ్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ పలు ఫొటోలు షేర్ చేశారు. ఖమ్మంలోని మా ఇంటికి అతిధిగా విచ్చేసిన ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్కు స్వాగతం. ఆచార్య చిత్రం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఎంపిక చేయడం సంతోషకరం అని తన ట్వీట్లో పేర్కొన్నారు పువ్వాడ.