లండన్: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్(Ashes Test Series) రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఆ సిరీస్లో ఆసీస్ ప్రస్తుతం 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. అయితే ఆ కాంటెస్ట్ గురించి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్( Anthony Albanese), ఇంగ్లండ్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) చర్చించారు. లుథివేనియా రాజధాని విల్నియస్లో జరుగుతున్న నాటో భేటీలో క్రికెట్ గురించి మాట్లాడుకున్నారు. ఇంగ్లండ్, ఆసీస్ మధ్య వాణిజ్యం ఒప్పందం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో పాటు ఇతర అంశాలపై చర్చించిన ఆ ఇద్దరూ కాసేపు క్రికెట్ గురించి కూడా జోకులేసుకున్నారు.
ఒప్పంద పత్రాల అప్పగింత సమయంలో.. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ .. తన వద్ద ఉన్న ఫైల్ నుంచి ఓ ప్లకార్డును తీసి చూపించారు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్లో 2-1 తేడాతో ఆసీస్ ఆధిక్యంలో ఉన్నట్లు ఆ ప్లకార్డుపై రాసి ఉంది. అయితే ఆల్బనీస్ చూపిన ప్లకార్డుకు కౌంటర్గా .. బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ టేబుల్పై ఫైల్ నుంచి ఓ ఫోటోను తీసి చూపించారు. మూడవ టెస్టులో ఇంగ్లండ్ ప్లేయర్లు విన్నింగ్ష్ మూమెంట్ను ఎంజాయ్ చేస్తున్న పిక్ ఆ ఫోటోలో ఉంది.
And of course we discussed the #Ashes pic.twitter.com/FeKESkb062
— Anthony Albanese (@AlboMP) July 11, 2023
అయితే దానికి కౌంటర్గా రెండో టెస్టులో వివాదాస్పదం అయిన బెయిర్స్టో రనౌట్ ఫోటోను ఆల్బనీస్ చూపించారు.ఆ సమయంలో రిషి సునాక్ ఓ కౌంటర్ డైలాగ్ వేశారు. తాను సాండ్పేపర్ తీసుకురాలేదన్నారు. గతంలో ఓసారి ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ట్యాంపరింగ్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఆ ఘటనను ఉద్దేశిస్తూ బ్రిటీష్ ప్రధాని సునాక్ సాండ్ పేపర్ డైలాగ్ కొట్టారు.ఆ సమయంలో ఇద్దరు నేతలు తెగ నవ్వునుకున్నారు.
ఇటీవల బెయిర్స్టో రనౌట్ వివాదంపై రెండు దేశాల నేతలు పబ్లిక్గా కామెంట్ చేసిన విషయం తెలిసిందే.