IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు ఇప్పుడు వేలం మీద దృష్టి సారించాయి. డిసెంబర్ 19 (?)న జరగాల్సి ఉన్న ఐపీఎల్ వేలంలో ఏ ఆటగాడిని దక్కించుకోవాలి..? జట్టు కూర్పు ఎలా ఉంటే బాగుంటుందో అంచనా వేసుకుని ఆ మేరకు ప్లేయర్లను తీసుకునే అవకాశముంది. ఈసారి వేలంలో ముంబై ప్రధానంగా బౌలర్లపై దృష్టి పెట్టనున్న నేపథ్యంలో ఆ జట్టు సఫారీ పేసర్ గెరాల్డ్ కొయెట్జ్ ను దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. కొయెట్జ్ ముంబై ప్లేయర్గా కరెక్ట్ సూట్ అవుతాడని కామెంట్స్ చేశాడు.
వేలం నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందిస్తూ… `కొయెట్జ్ చూడటానికి ఎంఐ ప్లేయర్గా కనిపిస్తున్నాడు. అతడికి ముంబై ఇండియన్స్ జెర్సీ కరెక్ట్గా సరిపోతుంది. రాబోయే వేలంలో ముంబై బౌలర్ల విషయంలో ఇతర ప్రత్యామ్నాయాలు చూడకుంటే మాత్రం కచ్చితంగా ఆ జట్టు కొయెట్జ్ను దక్కించుకునేందుకు పోటీ పడుతుంది..` అని అన్నాడు. ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్లో ఈ సఫారీ పేసర్ ఎనిమిది మ్యాచ్లలో 20 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
Ashwin said “Coetzee is a very Mumbai Indians player, that blue jersey with gold on him, bowling at the Wankhede Stadium, bustling in, he looks like an MI sort of a player. If they don’t get anybody, I think they are going for him”. [Ashwin YT] pic.twitter.com/RUA9sczUgR
— Johns. (@CricCrazyJohns) November 28, 2023
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తాము తీసుకున్న ఆటగాళ్లను బాగా చూసుకుంటాయని, కోర్ టీమ్ను అవి అంత ఈజీగా మార్చవని అశ్విన్ చెప్పాడు. వాళ్ల కోసం వేలంలో ఎంతవరకైనా వెళ్తాయని, ఆ ఆటగాళ్ల నుంచి కావాల్సింది తీసుకుంటాయే గానీ వారిని వదులుకోవని అశ్విన్ తెలిపాడు. ఐపీఎల్లో సాగుతున్న రిటెన్షన్స్, రిలీజ్ ప్రక్రియను చూస్తుంటే ఇది ఇండియన్ ప్రీమియర్ లీగా లేక ఇంగ్లీష్ ప్రీమియర్ లీగా అన్నా అనుమానం కలుగుతుందని అన్నాడు.