చెన్నై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు పేస్ ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్.. దేవ్ధర్ ట్రోఫీలో సౌత్ జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 24 నుంచి పుదుచ్చేరిలో జరుగనున్న టోర్నీలో సౌత్జోన్కు టీమ్ఇండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అర్జున్.. ఆల్రౌండర్గా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. బీసీసీఐ నిర్వహిస్తున్న ఎమర్జింగ్ ఆల్రౌండర్స్ క్యాంప్లోనూ అర్జున్ ప్లేస్ దక్కించుకున్న విషయం తెలిసిందే.