చెన్నై: ఐపీఎల్ 2023 ట్రోఫీని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సంబరాలను గ్రాండ్ సెలబ్రేట్ చేసుకుందా టీమ్. ధోనీ(MS Dhoni) నేతృత్వంలో చెన్నై అయిదోసారి టైటిల్ కొట్టింది. తాజా విక్టరీ తర్వాత ఫ్యాన్స్తో ధోనీ ఎంజాయ్ చేశాడు. స్పెషల్గా తయారు చేసిన కేక్ను అతను కట్ చేశాడు. పసుపు రంగులో ఉన్న 5 టైర్ కేక్ను ధోనీ కట్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ద కింగ్స్ విక్టరీ మార్చ్ అని ఆ వీడియోకు టైటిల్ ఇచ్చారు.
ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై జట్టును గ్రీట్ చేసేందుకు వేలాది మంది అభిమానులు ఎగబడ్డారు. ఆ వీడియోలో ఫ్యాన్స్ విజువల్స్ కూడా ఉన్నాయి. ట్రోఫీని సొంత ఇంటికి తెచ్చిన ఆనందంలో సీఎస్కే సభ్యులు డ్యాన్స్ చేస్తూ సంబరాల్లో మునిగిపోయారు. బ్యాంకెట్ హాల్లో చెఫ్లు తయారు చేసిన ఫైవ్-టైర్ కేక్ను కట్ చేశారు. సీఎస్కే జెర్సీ థీమ్ కలర్స్తో ఆ కేక్ను డిజైన్ చేశారు.