హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఏషియన్ పారా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో భారత సైక్లిస్ట్లు సత్తాచాటారు. సోమవారం ఒక్క రోజే మనవాళ్లు 4 స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు. అర్షద్ షేక్ (సీ2 కేటగిరీ)లో రెండు స్వర్ణాలు కైవసం చేసుకోగా.. జ్యోతి గదేరియా (సీ2 కేటగిరీ)లో రెండు పసిడి పతకాలు గెలుచుకున్నారు. దీంతో ఈ టోర్నీలో భారత్ పతకాల సంఖ్య 16కు చేరింది. ఇందులో 8 స్వర్ణాలు, 6 రజతాలు, 2 కాంస్యాలు ఉన్నాయి.