నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతుల విజ్ఞప్తి
తొగుట, మార్చి 18 : ఎగువన గోదారమ్మ రాకతో సిద్దిపేట జిల్లాలోని వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే గోదావరి జలాలు మల్లన్న సాగర్ పంప్హౌస్ నుంచి కొండ పోచమ్మ ప్రాజెక్టుకు చేరాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని తుక్కాపూర్లో ఉన్న 12వ ప్యాకేజీ పంప్హౌస్ నుంచి మల్లన్న సాగర్ కాలు వ ద్వారా దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గా ల్లోని 57 చెరువులు, కుంటలను నింపుతున్నారు. యా సంగిలో సాగు చేసిన పంటలకు మరో 30-40 రోజుల పాటు నీళ్లు అందితే పంటలు చేతికి వస్తాయి. మల్లన్న సాగర్ కాలువ ద్వారా నీళ్లు విడుదల చేస్తుండడంతో చెరువు, కుంటల పరిధిలో సాగునీటి గోస లేకుండా తీరింది. ఈ యేడాది కాలం కలిసిరావడంతో దుబ్బా క నియోజకవర్గానికి వరప్రదాయినీ కూడవెల్లి వాగు పొంగి ప్రవహించడంతో యాసంగిలో వాగు పరిసర ప్రాంతాల రైతులు పెద్దఎత్తున వరి పంటను సాగు చేశా రు. వాగులో నీళ్లు ఉంటే దొమ్మాట, సూరంపల్లి, లిం గాపూర్ వరకు కూడా భూగర్భ జలాలు పెరగడంతో ఆయా గ్రామాల్లో సైతం వరిసాగు వేశారు. మండుతున్న ఎండలకు తోడు వరిపంటకు ఎక్కువగా నీటి అవసరం ఉండటంతో రోజురోజుకు కూడవెల్లి వాగు లో నీటిమట్టం తగ్గుతున్నది. ప్రస్తుతం వరిపంట పొ ట్టదశలో ఉంది. ఈ సమయంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో వాగులో నీళ్లు తగ్గిపోవడంతో పంటలు ఎండిపోయే అవకాశం ఉంది.
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్పూర్ మండలం చేబర్తి వద్ద జన్మించి.. దుబ్బాక, సిరిసిల్ల నియోజకవర్గాల మీ దుగా వెళ్లే కూడవెల్లి వాగులో ప్రస్తుతం నీరు తగ్గిపోవడంతో బోసిపోతున్నది. తొగుటలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు సాగుతుండగా, మల్లన్నసాగర్ మధ్య కాలువ ద్వారా కొండ పోచమ్మకు నీళ్లు వెళ్తున్నాయి. కానీ, మల్లన్నసాగర్ కిందనే ఉన్న కూడవెల్లి బోసిపో యి ఎడారిలా తలపిస్తున్నది. వాగులు, వంకలు, చెరు వులు, కుంటలను గోదావరి జలాలతో నింపుతామని, మూడు పంటలు పండుతాయని సీఎం కేసీఆర్ భరో సా ఇవ్వడంతో ఇక్కడి రైతులకు కొండంత ధైర్యం వ చ్చింది. గతంలో కొండపోచమ్మ ప్రాజెక్టుకు నీళ్లు చేరగానే చేబర్తి చెరువు నుంచి కూడవెల్లి వాగులోకి నీళ్లు వదులుతారని రైతులు భావించారు. కానీ, వర్షాలు వి స్తారంగా కురవడంతో గోదావరి నీటి అవసరం లేకుం డా పోయింది. గతంలోనే సిద్దిపేట నియోజకవర్గంలో ని వాగులు, వంకలను గోదారి నీటితో నింపారు. కూ డవెల్లి వాగులోకి గోదావరి నీటిని విడుదల చేసి చెక్డ్యాంలు నింపి, పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. కూడవెల్లి వాగులోకి గోదావరి నీళ్లు ఎప్పు డు వస్తాయో? అని రైతులు ఎదురు చూస్తున్నారు. కూ డవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేస్తే వాగుపై ఉన్న చెక్డ్యాంలతో గజ్వేల్, దుబ్బాక, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని రైతులకు మేలు జరుగనుంది. ఇప్పటికే రైతు లు, టీఆర్ఎస్ నాయకులు మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా.. వారు సానుకూలంగా స్పందించారు.