Twitter Gets New CEO | మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలిగినట్లు వార్తలొచ్చాయి. ఆయన స్థానంలో డోర్సీ వారసుడిగా.. సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) పరాగ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. భారత్లో పుట్టిన పరాగ్ అగర్వాల్.. బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందిన తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ అందుకున్నారు.
2011 అక్టోబర్లో ట్విట్టర్లో పరాగ్ అగర్వాల్ చేరారు. నాటి నుంచి సంస్థలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ట్విట్టర్ విశిష్ట (Distinguished ) సాఫ్ట్వేర్ ఇంజినీర్గానూ పనిచేశారు. ట్విట్టర్లో చేరకముందు ఆయన మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, యాహూలో సేవలందించారు. ట్విట్టర్ టెక్నికల్ స్ట్రాటర్జీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కన్జూమర్ అండ్ సైన్స్ టైమ్లకు ఇప్పటి వరకు బాధ్యత వహించారు.
2019 డిసెంబర్లో పరాగ్ అగర్వాల్ను ప్రాజెక్ట్ బ్లూస్కై అనే ఇండిపెండెంట్ టీంకు ఇన్చార్జిగా ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ ప్రకటించారు. సోషల్ మీడియా వేదికపై దుర్భాషలాడే, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నియంత్రించడానికి డీ సెంట్రలైజ్డ్ స్టాండర్డ్తో కూడిన టూల్స్ తయారు చేసే ఆర్కిటెక్లు, ఇంజినీర్లు, డిజైనర్లకు ఈ బ్లూ స్కై వనరుగా ఉంటుంది.