ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. రోజురోజుకూ టెలిగ్రామ్ ను ఉపయోగించే వాళ్ల సంఖ్య పెరుగుతుండటంతో యాప్ ను కూడా సరికొత్తగా తీర్చిదిద్దుతోంది టెలిగ్రామ్. వాట్సప్ కు పోటీగా వచ్చిన దేశీయ యాప్ టెలిగ్రామ్.. ఇప్పటికే తన యూజర్ల కోసం చాలా ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా మరో అప్ డేట్ తో ముందుకు వచ్చింది టెలిగ్రామ్.
టెలిగ్రామ్ లో ఉన్న వీడియో కాలింగ్ ఫీచర్ లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రూప్ వీడియో కాల్ లో 1000 మంది వరకు పార్టిసిపెంట్స్ యాడ్ కావచ్చు. ఇదివరకు 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాలింగ్ లో యాడ్ అయ్యే అవకాశం ఉండేది కాదు. తాజాగా వచ్చిన ఫీచర్ లో 30 మంది వరకు గ్రూప్ వీడియో కాల్ ను బ్రాడ్ కాస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ కాల్ లో వెయ్యి మంది వరకు యాడ్ కావచ్చు. ఈ ఫీచర్ ఎక్కువగా కంపెనీ మీటింగ్స్ కు ఉపయోగపడుతుంది. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనుకునే వాళ్లకు, ఆన్ లైన్ క్లాసులు నిర్వహించే వాళ్లకు కూడా ఈ ఫీచర్ అద్భుతంగా పనిచేస్తుంది.
నిజానికి మహమ్మారి వల్ల.. అంతా స్థంభించిపోవడంతో ఈ లెర్నింగ్ కు ఎక్కువగా అవకాశాలు కల్పించేందుకే ఈ ఫీచర్ ను తీసుకొచ్చినట్టు టెలిగ్రామ్ వెల్లడించింది. భవిష్యత్తులో ఇంకా పార్టిసిపెంట్స్ లిమిట్ ను కూడా పెంచుతామని టెలిగ్రామ్ తెలిపింది. యాప్ లో గ్రూప్ వీడియో కాల్ ను స్టార్ట్ చేయాలంటే.. గ్రూప్ అడ్మిన్ వాయిస్ చాట్ ను క్రియేట్ చేసి వీడియోను ఆన్ చేయాల్సి ఉంటుంది. దీంతో గ్రూప్ వీడియో కాలింగ్.. ఆ గ్రూప్ లో ఉన్నవాళ్లందరికీ అందుబాటులోకి వస్తుంది.
అలాగే.. టెలిగ్రామ్ యూజర్స్ వీడియో కాల్స్ ను రికార్డ్ చేసుకోవచ్చు. ఆ వీడియోలను హై క్వాలిటీతో సేవ్ చేసుకొని ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లో షేర్ అయ్యే రెగ్యులర్ వీడియోలను 0.5 లేదా 2x స్పీడ్ తో వీక్షించవచ్చు. వన్ టూ వన్ కాల్స్ ను కూడా ఇందులో రికార్డు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ ఫీచర్స్ కోసం యూజర్స్ లేటెస్ట్ వర్షన్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని టెలిగ్రామ్ ప్రకటించింది.