Samsung Galaxy F14 5G | గత కొన్ని నెలలుగా బడ్జెట్, మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు ఆవిష్కరిస్తున్న దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్.. తాజాగా భారత్ మార్కెట్లోకి 5జీ లో మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. గెలాక్సీ ఎఫ్14 5జీ ఫోన్ విత్ 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 90 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తున్నది. 6000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ విత్ 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 14 5జీ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. శుక్రవారం మార్కెట్లో ఆవిష్కరించినా ఈ నెల 30 వరకు సేల్స్ ప్రారంభం కావని శాంసంగ్ వెబ్సైట్ పేర్కొంది.
రెండు స్టోరేజీ వేరియంట్లలో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ లభిస్తుంది. 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.12,990, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.14,990లకు లభిస్తుంది. ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్కార్ట్, శాంసంగ్ అధికారిక వెబ్సైట్తోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
ఓఎంజీ బ్లాక్, జీవోఏటీ గ్రీన్, బీఏఈ పర్పుల్ కలర్స్లో శాంసంగ్ ఎఫ్14 5జీ ఫోన్ లభిస్తుంది. ఈ నెల 30 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం అవుతాయి.