Motorola Edge 30 Pro | మోటరోలా నుంచి ఎడ్జ్ సిరీస్లో 30 ప్రో మోడల్ ఫోన్ ఇటీవలే లాంచ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఫోన్ సేల్స్ భారత్లో ప్రారంభం అయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి ఫ్లిప్కార్ట్, ఇతర రిటైల్ స్టోర్స్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్తో వచ్చిన మోటరోలా ఎడ్జ్ 30 ప్రో ఫోన్ ధరను భారత్లో రూ.49,999గా నిర్ణయించారు. రెండు కలర్స్లో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. కాస్మోస్ బ్లూ, స్టార్డస్ట్ వైట్ కలర్స్లో లభించనుంది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్నవాళ్లు ఈ ఫోన్ను ప్రారంభోత్సవ ఆఫర్ కింద ఫ్లిప్కార్ట్లో రూ. 5000 డిస్కౌంట్కు కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్ట్స్ ఉన్నవాళ్లు 5 శాతం క్యాష్బ్యాక్ కూడా పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది.
6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్సెట్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్స్ టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్, ట్రిపుల్ కెమెరా యూనిట్, డ్యుయల్ ఎల్ఈడీ ఫ్లాష్, 60 ఎంపీ సెల్ఫీ స్నాపర్, 50 ఎంపీ ప్రైమరీ మెగాపిక్సెల్ షూటర్, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 30 ప్రో విడుదల అయింది.