Flipkart Shop From Home Days sale: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించడంలో ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. వర్క్ఫ్రమ్హోం, ఆన్లైన్ క్లాసులు, బోధనతో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ మరో ప్రత్యేక సేల్ను ప్రకటించింది. షాప్ ఫ్రమ్ హోమ్ డేస్ సేల్ పేరుతో మూడు రోజుల పాటు మే 27 నుంచి మే 29 మధ్య సేల్ నిర్వహించనుంది. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత సేల్ ప్రారంభంకానుంది.
మొబైల్, టాబ్లెట్, స్మార్ట్వాచ్, స్మార్ట్టీవీ, రిఫ్రిజిరేటర్ దుస్తులు, బూట్లు, కిరాణా సామాను, ఫర్నిచర్,
ఇతర వస్తువులను కొనుగోలు చేసినవారికి 10శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్లు ఆసుస్, రియల్మీ, శాంసంగ్, పొకో వంటి వాటిపై ఆఫర్లు అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ డీల్స్, నోకాస్ట్ ఈఎంఐ, మొబైల్ ప్రొటెక్షన్ స్కీములు ప్రకటించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.