న్యూఢిల్లీ : రియల్మి టెక్లైఫ్కు చెందిన డిజో భారత్లో డిజో వాచ్ ఆర్ టాక్, వాచ్ డీ టాక్ పేరుతో రెండు స్మార్ట్వాచ్లను లాంఛ్ చేసింది. డిజైన్ పరంగా రెండు స్మార్ట్వాచ్లు భిన్నంగా ఉన్నా ఫీచర్లు ఒకే రకంగా ఉన్నాయి. వాచ్ ఆర్ టాక్ రౌండ్ డయల్ కలిగిఉండగా, వాచ్ డీ టాక్ స్క్వేర్ డయల్తో ఆకట్టుకుంటోంది.
రెండు స్మార్ట్వాచ్లు బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీ కలిగిఉన్నాయి. డిజో వాచ్ ఆర్ టాక్ రూ 4999 ఎంఆర్పీతో వచ్చినా ప్రారంభ ధరగా రూ 3,799కి లభిస్తోంది. గ్రే, బ్లాక్ కలర్స్లో లభించే ఈ స్మార్ట్వాచ్లు సెప్టెంబర్ 13 నుంచి అందుబాటులో ఉంటాయి. ఇక డిజో వాచ్ డీ టాక్ రూ 2,799 ప్రారంభ ధరతో ఎక్స్ట్రా గ్రీన్ కలర్ వేరియంట్లోనూ సెప్టెంబర్ 16 నుంచి అందుబాటులో ఉంటుంది. ఇక డిజో వాచ్ ఆర్ టాక్, వాచ్ డీ టాక్ రెండు స్మార్ట్ఫోన్లు ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో లభిస్తాయి.